Bengaluru : మెట్రోలో పల్టీలు కొట్టిన మహిళ.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు.. ఎక్కడంటే?

మెట్రోల్లో వీడియోలు నిషేధమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ప్రయాణికులు పట్టించుకోట్లేదు. తాజాగా బెంగళూరు రైల్లో ఓ మహిళ పల్టీలు కొడుతున్న వీడియో చూసి జనం షాకయ్యారు.

Bengaluru : మెట్రోలో పల్టీలు కొట్టిన మహిళ.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు.. ఎక్కడంటే?

Bengaluru

Updated On : August 22, 2023 / 12:25 PM IST

Bengaluru : మెట్రోలో పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, రీల్స్ ఇవన్నీ రొటీన్ అయిపోయాయి. నిబంధనలకు ఇవి విరుద్ధమని అధికారులు మొత్తుకుంటున్నా ప్రయాణికులకు పట్టట్లేదు. రోజూ ఏదో ఒక చోట మెట్రోలో వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరు మెట్రో వార్తల్లో నిలిచింది. ఓ మహిళ మెట్రోలో పల్టీలు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది.

Bengaluru : ఒకే సమయంలో వేర్వేరు యాప్‌లలో రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్న బెంగళూరు ఆటో డ్రైవర్లు.. అలా ఎలా?

మెట్రో కార్పొరేషన్లు రైలు కోచ్‌లలో వీడియోలు షూట్ చేయడంపై నిషేధం గురించి పదే పదే గుర్తు చేస్తున్నా ప్రయాణికులు మాత్రం వీడియోగ్రఫీలో మునిగి తేలుతున్నారు. డిజిటల్ క్రియేటర్, అథ్లెట్ కూడా అయిన ఓ మహిళ బెంగళూరు ట్రైన్‌లో పల్టీలు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిషా శర్మ (mishaa_official_) అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో మహిళ రైలు కోచ్‌లో నిలబడి పల్టీలు కొట్టింది. ఇది చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొందరికి ఆమె చేష్టలు నవ్వు పుట్టించాయి.

Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు

ఈ వీడియో చూసిన కొందరు ‘మీ టాలెంట్‌ని భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో చూపించండి.. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించకండి’ అని.. ‘యు ఆర్ ది బెస్ట్.. అద్భుతం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఢిల్లీ మెట్రో ఈ సంవత్సర ప్రారంభంలోనే మెట్రోల్లో వీడియోలు చిత్రీకరించవద్దని ప్రయాణికులను కోరింది. పలు చోట్ల వీడియో చిత్రీకరణ గురించి హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా ప్రయాణికులు ఈ ఫీట్లకు చెక్ పెట్టట్లేదు.

 

View this post on Instagram

 

A post shared by MISHA SHARMA ?? (@mishaa_official_)