Viral Video : ఇదేం పిచ్చిరా బాబూ! సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఈ యువకుడు ఏం చేశాడో తెలుసా?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతుంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొందరు తమని తాము ఏదో రకంగా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం రక రకాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డ్యాన్స్లు, స్టంట్స్, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వాటికి వ్యూస్, లైకులు రాకుంటే బాధపడుతున్నారు. వైరల్ అయ్యేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ప్రమాదం అని తెలిసినా లైకులు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లు పెంచుకునేందుకు యువత చేస్తున్న చేష్టలపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాణం పోయినా, గాయాలైన పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సోషల్ మీడియా మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం.’ అని సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో ఏం ఉందంటే..? రోడ్డు పై మూడు బైకులను పార్క్ చేయగా.. ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి మూడు బైక్ పై నుంచి జంప్ చేశాడు. ఈ క్రమంలో అతడి ముఖం రోడ్డును బలంగా గుద్దుకున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఆ యువకుడికి గాయాలైనట్లుగా కనిపిస్తోంది. ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది అన్న విషయాలు తెలియరాలేదు.
ప్రాణం పోయినా, గాయాలైన పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సోషల్ మీడియా మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం. pic.twitter.com/axKflMGRSS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 26, 2024