Ram Temple Event : అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సోనియా, ఖర్గే?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.....

Sonia Gandhi, M Kharge
Ram Temple Event : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో వారి నిర్ణయాన్ని సరైన సమయంలో తెలియజేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులు, రాష్ట్ర శాఖ ముఖ్యులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం మీడియా సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ ఈ వేడుకకు హాజరవుతారా అని విలేఖరులు ప్రశ్నించారు.
ALSO READ : Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్లో మోదీ సాహస స్విమ్మింగ్
‘‘విషయాన్ని మళ్లించడానికి ప్రయత్నించవద్దు, ఇది భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి. ఈ అంశంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఖర్గేజీకి, సోనియా జీకి ఆహ్వానం అందింది, సరైన సమయంలో, మేం వారి నిర్ణయం మీకు చెబుతాను’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.
ALSO READ : Ram Janmabhoomi temple : అయోధ్య రామ మందిరంలో హైటెక్ భద్రతకు రూ.90కోట్లతో కవచ్
రామాలయం ప్రారంభోత్సవానికి మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీతో పాటు లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరిని కూడా ఆహ్వానించారు. జనవరి 22వతేదీన జరగనున్న రామాలయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు 6వేల మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు.