Ramayan Express Train..వెయిటర్స్ డ్రెస్ కోడ్ పై స్వాముల ఆగ్రహం
ఇటీవల ప్రారంభమైన రామాయణ్ ఎక్స్ ప్రెస్ రైలులో వెయిటర్స్ డ్రెస్ కోడ్ పై మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయిటర్స్ కాషాయ దుస్తులు ధరించాలన్న

Ramayan Express
Ramayan Express Train ఇటీవల ప్రారంభమైన రామాయణ్ ఎక్స్ ప్రెస్ రైలులో వెయిటర్స్ డ్రెస్ కోడ్ పై మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయిటర్స్ కాషాయ దుస్తులు ధరించాలన్న నిబంధన..హిందు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. వెంటనే వారి డ్రెస్ కోడ్ మార్చకపోతే డిసెంబర్- 12 రైలును ఢిల్లీలో ఆపేస్తామని హెచ్చరించారు.
ఉజ్జయిన్ అఖాడా పరిషద్ మాజీ ప్రధాన కార్యదర్శి అద్వేశ్ పూరి మాట్లాడుతూ…ఈ విషయమై రెండు రోజుల క్రితం కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశాం. రామాయణ్ ఎక్స్ప్రెస్ రైలులో వెయిటర్స్కి కాషాయ దుస్తులు మాత్రమే కాకుండా వారి మెడల్లో రుద్రాక్ష మాలలు వేశారు. వారిని సాధువుల్లా తయారు చేశారు. ఇది హిందు మత విశ్వాసాలను దెబ్బతీయడమే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారి డరెస్ కోడ్ ను ఉపసంహరించుకోవాలి. రైల్వే శాఖ తమ పద్దతి మార్చుకోకపోతే రైల్వే పట్టాలపై నిరసన చేయడానికి కూడా వెనుకాడబోం’’ అని అద్వేశ్ పూరి తెలిపారు.
కాగా, 17 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలోని సఫ్దార్గంజ్ రైల్వే స్టేషన్లో నవంబర్ 7న మొట్టమొదటి రామాయణ్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని మొత్తం 15 ప్రాంతాల్లో గల రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాలను ఈ ట్రైన్ చుట్టి వస్తుంది. అయోధ్య, ప్రయాగ్, నందిగ్రామ్, జానక్పూర్, చిత్రకూట్, సీమర్హి, నాసిక్, హంపీ, రామేశ్వరం ప్రాంతాల్లో మొత్తం 7,500 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుంది.
ALSO READ Release Clashes: ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా ప్రాబ్లమ్స్..!