CM KCR: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
CM KCR: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రెండు హెలికాప్టర్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాంట్ వద్దకు వెళ్లారు. తొలుత ఫేజ్-1 లోని యూనిట్ -2 బాయిలర్ నిర్మాణ పనులు పరిశీలించడానికి వెళ్లిన సీఎం 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్ చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న తీరును ట్రాన్స్ కో, జన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.