Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర.. భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు.. ఫొటో గ్యాలరీ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటలకు మాండ్యా జిల్లాలోని కె మాలేనహళ్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 11గంటలకు పాదయాత్ర అంచె చిట్టనహళ్లి సమీపం వరకు పాదయాత్ర కొనసాగింది. రాహుల్ అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల నేతలతో రాహుల్ ముచ్చటించారు. సాయంత్రం 4గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమువుతంది. యాత్ర పొడవున రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తయిన భారత్ జోడోయాత్ర సెప్టెంబరు 30న కర్నాటకకు చేరుకుంది. 21రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనుంది.














