వైఎస్సార్ సీపీలో చేరిన దగ్గుబాటి, ఆమంచి

అమరావతి : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఫిబ్రవరి 27 బుధవారం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ మేరకు జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితోపాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ కూడా పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
తాడేపల్లిలోని ఆ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమంచి, హితేష్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ అవిశ్రాతంగా పోరాడుతున్నారని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.