ఎన్నికల సందడి : మే 23న ఓట్ల లెక్కింపు 

  • Published By: chvmurthy ,Published On : March 11, 2019 / 01:41 AM IST
ఎన్నికల సందడి : మే 23న ఓట్ల లెక్కింపు 

Updated On : March 11, 2019 / 1:41 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అధికారి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. సింగిల్ ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించనున్నారు. 

మార్చి 18వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు.  నామినేషన్ల పరిశీలన మార్చి 26, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28గా ఉంది. ఏప్రిల్ 11 ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు మాత్రం మే 23 రిలీజ్ చేయనున్నాయి.