Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్రలో భక్తుల తీవ్ర ఇక్కట్లు!

Char Dham Yatra : ఎత్తైన శిఖరాలలో మంచు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్రలో భక్తుల తీవ్ర ఇక్కట్లు!

Char Dham Yatra Hit By Rains ( Image Credit : ANINewsUP/Twitter/Google )

Updated On : May 11, 2024 / 10:35 PM IST

Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన మరుసటి రోజు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో యాత్రలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లతో పాటు చార్ ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన గంగోత్రి ఆలయంతో సహా గంగా లోయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి ఒక రోజు ముందు ఎత్తైన శిఖరాలలో హిమపాతం, లోతట్టు ప్రాంతాలు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు బద్రీనాథ్‌లో వాతావరణం కూడా ఒక్కసారిగా మారింది. భారీగా మంచు కురుస్తోంది.

అంతకుముందు రోజు, యమునోత్రికి కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి క్యూలలో చిక్కుకున్నారు. అధికారులు నిర్వహణ సరిగా లేకపోవడమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. యమునోత్రి, కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు భక్తుల కోసం తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది.

శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునోత్రి, కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకోగా, వేలాది మంది భక్తుల సమక్షంలో గంగోత్రి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12.25 గంటలకు తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు వస్తారు.

Read Also : Tech Tips : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ రావడం లేదా? నెట్‌వర్క్ స్పీడ్ కోసం ఈ 5 సింపుల్ టిప్స్ ట్రై చేయండి!