CSKvDC: ధావన్ హాఫ్ సెంచరీ, చెన్నై టార్గెట్ 148

CSKvDC: ధావన్ హాఫ్ సెంచరీ, చెన్నై టార్గెట్ 148

Updated On : March 26, 2019 / 4:11 PM IST

ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన ఢిల్లీ.. చెన్నైల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ అనుకున్నట్లుగానే శుభారంభాన్ని నమోదు చేసింది. పృథ్వీ షా(24), ధావన్(51) చక్కటి ఓపెనింగ్‌ ఇచ్చారు. అంత దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌ను ధావన్, శ్రేయాస్ అయ్యర్(18)లు పరవాలేదని పించారు. 

ఓపెనర్ గా దిగిన ధావన్ 17.1ఓవర్ల వరకూ క్రీజులో నిలదొక్కుకుని వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. రిషబ్ పంత్ 13 బంతుల్లో 25పరుగులు చేసి దూకుడుగా ఆడాడు.  ఆ తర్వాత వచ్చిన ఇంగ్రామ్(2), పాల్(0), అక్సర్ పటేల్(9),రాహుల్ తివాతియా(11)లు సరిపెట్టుకున్నారు. 

చెన్నై బౌలర్లు ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో అందుకుని దీపక్ చాహర్(1), రవీంద్ర జడేజా(1), ఇమ్రాన్ తాహిర్(1), డేన్ బ్రావో(3)వికెట్లు తీయగలిగారు.