ENG vs IND : రెండో ఇన్నింగ్స్లో భారత్ 364 ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 371
హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల టార్గెట్ నిలిచింది.

హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల టార్గెట్ నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 364 పరుగులకు ఆలౌలైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (137; 247 బంతుల్లో 18 ఫోర్లు), రిషబ్ పంత్ (118; 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు చేశారు.
మిగిలిన వారిలో సాయి సుదర్శన్ (30), కరుణ్ నాయర్ (20) ఓ మోస్తరుగా రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్ లు చెరో మూడు వికెట్లు తీశారు. షోయబ్ బషీర్ రెండు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్లు తలా ఓ వికెట్ పడగొట్టారు…
తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.