ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. 61 ఏళ్ల రికార్డు పై రిష‌బ్ పంత్ క‌న్ను..

మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూలై 23 నుంచి 27 వ‌ర‌కు నాలుగో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. 61 ఏళ్ల రికార్డు పై రిష‌బ్ పంత్ క‌న్ను..

ENG vs IND 4th test Rishabh pant eye on 61 year old record

Updated On : July 18, 2025 / 8:43 AM IST

మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జూలై 23 నుంచి 27 వ‌ర‌కు నాలుగో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక పంత్ మ‌రో 101 ప‌రుగులు చేస్తే.. ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు కుంద‌ర‌న్ పేరిట ఉంది. 1964లో ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. అప్పుడు కుంద‌ర‌న్ 10 ఇన్నింగ్స్‌ల్లో 525 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచ‌రీలు ఓ అర్థ‌శ‌త‌కం ఉంది. అంతేకాదండోయ్‌.. ఓ టెస్టు సిరీస్‌లో 500కు పైగా ప‌రుగులు సాధించిన ఏకైక భార‌త వికెట్ కీప‌ర్ కూడా కుంద‌ర‌నే కావ‌డం గ‌మ‌నార్హం.

ENG vs IND : బుమ్రా ఆడితే టీమ్ఇండియా ఓడిపోయింది.. నాలుగో టెస్టు ముందు మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో పంత్ త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటున్నాడు. హెడింగ్లీ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (134, 118) సెంచ‌రీలు చేశాడు. ఆ త‌రువాత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65, 74, 9 ప‌రుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 425 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఈ సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో భార‌త ఆట‌గాడిగా ఉన్నాడు.

ఒక వేళ పంత్ 101 ప‌రుగుల‌ను మాంచెస్ట‌ర్‌లో సాధించ‌క‌పోయిన‌ప్ప‌టికి కూడా అత‌డికి మ‌రో అవ‌కాశం ఉంది. జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు ఓవ‌ల్ వేదిక‌గా జరిగే మ్యాచ్‌లో కూడా ఛాన్స్ ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో క‌లిపి పంత్ 101 ప‌రుగులు సాధించ‌డం ప్ర‌స్తుతం అత‌డు ఉన్న ఫామ్‌తో పెద్ద క‌ష్టం ఏమీ కాదు. అప్పుడు 61 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

IND-W vs ENG-W : మ‌రీ ఇంత బ‌ద్ద‌కం అయితే ఎలా హ‌ర్లీన్ డియోల్‌.. బ్యాట్ కింద పెట్టాల‌ని తెలియ‌దా? ఇప్పుడు చూడు ఏమైందో..

ఓ టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త వికెట్ కీప‌ర్లు వీరే..
* కుంద‌ర‌న్ – ఇంగ్లాండ్ పై 5 మ్యాచ్‌ల్లో 525 ప‌రుగులు (1964లో)
* రిష‌బ్ పంత్ – ఇంగ్లాండ్ పై 3 మ్యాచ్‌ల్లో 425 ప‌రుగులు (2025లో)
* ఫ‌రూఖ్ ఇంజినీర్ – ఇంగ్లాండ్ పై 5 మ్యాచ్‌ల్లో 415 ప‌రుగులు (1972లో)
* రిష‌బ్ పంత్ – ఆస్ట్రేలియాపై 4 మ్యాచ్‌ల్లో 350 ప‌రుగులు (2018లో)