T20వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్..భారత్ తో తలపడనున్న జట్లు ఇవే

పురుషుల టీ20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబరు 18,2020న మొటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నవంబర్ 15,2020న పైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. టోర్నీలో అతి చిన్న జట్లు కూడా ఉండడంతో షెడ్యూల్ రూపకల్పనలో పలు జాగ్రత్తలు తీసుకుంది. చిన్న జట్లను ఎ, బి గ్రూపులుగా విభజించిన ఐసీసీ అందులో రెండు పెద్ద జట్లును వేసింది.
గ్రూప్-ఎలో శ్రీలంక లాంటి పెద్ద జట్టుతోపాటు పపువా న్యూగినియా, ఐర్లండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్ వంటి పెద్ద జట్టుతోపాటు నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్లను వేసింది. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత పొందుతాయి. ఇక, సూపర్-12లో ఉన్న జట్లను గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. అక్టోబరు 18న ఆస్ట్రేలియాలోని కార్డినియా పార్క్లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత జట్టు మొత్తం 5 మ్యాచ్లు ఆడనుంది. అక్టోబరు 24న పెర్త్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆడనుండగా, 29న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ‘ఎ2’తో ఆడనుంది. మూడో మ్యాచ్లో ఇంగ్లండ్తో మెల్బోర్న్లోనే తలపడనుంది. నవంబరు 5న ‘బి1’ విజేతతో నాలుగో మ్యాచ్, నవంబరు 8న ఆఫ్ఘనిస్థాన్తో సిడ్నీలో ఐదో మ్యాచ్ ఆడనుంది.