RR vs CSK : ఐపీఎల్ 2025 సీజన్లో వైభవ్ సూర్య వంశీ ఆఖరి మ్యాచ్.. ధోని సమక్షంలో..
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది.

MS Dhoni vs Vaibhav Suryavanshi
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్లో ఇప్పటి వరకు రాజస్థాన్ 13 మ్యాచ్లు ఆడింది. కేవలం మూడు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్రన్రేట్ -0.701గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. చెన్నైతో మ్యాచ్లో ఓడిపోతే పదో స్థానానికి పడిపోతుంది. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి సీజన్ను కాస్త సంతృప్తితో ముగించాలని ఆర్ఆర్ భావిస్తోంది.
Digvesh Rathi : లక్నో స్టార్ స్పిన్నర్ దిగ్వేశ్ కు బీసీసీఐ భారీ షాక్.. ఓ మ్యాచ్ సస్పెన్షన్..
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్రన్రేట్ -0.992గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. రాజస్థాన్పై విజయం సాధించి ఓ స్థానాన్ని అయినా మెరుగుపరచుకోవాలని చెన్నై భావిస్తోంది.
కాగా.. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిషృతం కానుంది. ఈ టోర్నీలో అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా ఉన్న ధోని, అతి పిన్నవయస్కుడైన ఆటగాడిగా సూర్యవంశీతో తలపడనున్నాడు.
Mumbai Indians : ముంబై ఇండియన్స్కు గోల్డెన్ ఛాన్స్.. ఈజీగా ప్లేఆఫ్స్కు
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లోనే ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడో మ్యాచ్ కానుంది. చెన్నైతో మ్యాచ్లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి తొలి సీజన్ను ఘనంగా ముగించాలని ఈ 14 ఏళ్ల ఎడమ చేతి వాటం ఆటగాడు ఆరాటపడుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ల్లో వైభవ్ 32.50 సగటు 219.10 స్ట్రైక్రేటుతో 195 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై, రాజస్థాన్ జట్లు 31 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 16 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించగా 15 మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలుపొందింది.