RCB : కప్పు గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్..
ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించామని ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది

Courtesy BCCI
ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించామని ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది. తొలిసారి ఐపీఎల్ కప్పును గెలవడంతో బెంగళూరు నగరంలో ఆర్సీబీ టీమ్తో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావించింది. ఈ క్రమంలోనే ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విక్టరీ పరేడ్ను, సాయంత్రం 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.
🚨 RCB Victory Parade in Bengaluru ‼️
This one’s for you, 12th Man Army.
For every cheer, every tear, every year.
𝐋𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐢𝐬 𝐑𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐚𝐧𝐝 𝐭𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞 𝐜𝐫𝐨𝐰𝐧 𝐢𝐬 𝐲𝐨𝐮𝐫𝐬.🏆More details soon… pic.twitter.com/fMWuCGkVWX
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
అయితే.. పోలీసులు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విక్టరీ పరేడ్కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పారట. ఈ క్రమంలో విక్టరీ పరేడ్ను రద్దు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త విన్న ఆర్సీబీ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
🚨 OPEN BUS PARADE CANCELLED. 🚨
– The open bus Parade planned by RCB in Bengaluru has been cancelled due to heavy traffic congestion in the city. pic.twitter.com/LpGL8lJG5h
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
ఇప్పుడు కేవలం చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ మాత్రమే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారినే అనుమతించనున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బెంగళూరులోని సీబీడీ ప్రాంతం వైపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు వెళ్లకపోవడమే మంచిదని సాధారణ ప్రజలకు పోలీసులు సూచించారు.