WTC Points Table : బంగ్లాదేశ్ పై భార‌త్ సిరీస్ విజ‌యం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక మారిందా?

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

WTC Points Table : బంగ్లాదేశ్ పై భార‌త్ సిరీస్ విజ‌యం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక మారిందా?

Updated World Test Championship Points Table After India Sweep Bangladesh

Updated On : October 1, 2024 / 3:02 PM IST

WTC Points Table : కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో భార‌త్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తద్వారా రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2023-2025 (డ‌బ్ల్యూటీసీ)లో అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త్ ఈ విజ‌యంతో త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకుంది.

ప్ర‌స్తుతం భార‌త్ 74.24 విజ‌య‌శాతం క‌లిగి ఉంది. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా ఆస్ట్రేలియా (62.50 శాతం), శ్రీలంక (55.56 శాతం) లు ఉన్నాయి. ఇక భార‌త్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో కొన‌సాగుతోంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భార‌త్‌.. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం..

డ‌బ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో తాజా టెస్టు మ్యాచ్‌తో క‌లిపి భార‌త్ 11 టెస్టులు ఆడింది. 8 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడ‌గా, ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. విజ‌య‌శాతం 74.24 శాతం కాగా భారత్ ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12 టెస్టులు ఆడింది. ఇందులో 8 మ్యాచుల్లో గెల‌వ‌గా, 3 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్ విజ‌య‌శాతం 62.50గా ఉంది. ఆసీస్ ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి.

ఇక న్యూజిలాండ్ పై సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన శ్రీలంక మూడో స్థానానికి దూసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు లంక 9 మ్యాచులు ఆడ‌గా 5 మ్యాచుల్లో గెలిచింది. మ‌రో నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. లంక విజ‌య‌శాతం 55.56గా ఉంది. ఈ ప‌ట్టిక‌లో వెస్టిండీస్ ఆఖ‌రి స్థానంలో ఉంది. 9 మ్యాచులు ఆడ‌గా ఒక్క మ్యాచులోనే విండీస్ గెలిచింది. ఆరు మ్యాచుల్లో ఓడిపోగా రెండు మ్యాచుల‌ను డ్రా చేసుకుంది. 18.52 శాతం క‌లిగి ఉంది.

Sunil Gavaskar : టీ20 త‌ర‌హాలో రెండో టెస్టులో భార‌త్ బ్యాటింగ్‌.. అసంతృప్తిగా ఉన్న గ‌వాస్క‌ర్‌.. 9 వేల ప‌రుగులు..

మార్చి 2025 నాటికి పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు జూన్‌లో లార్డ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచులో ఆడ‌నున్నాయి.