T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో కోహ్లీ

T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో కోహ్లీ

Updated On : January 4, 2020 / 11:01 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత దక్కించుకున్న రోహిత్ శర్మను దాటేయనున్నాడు. 

కోహ్లీ.. రోహిత్‌లు 2వేల 633పరుగులతో సమానంగా ఉండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు రెస్ట్ దొరికింది. డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ విజృంభించాడు. 50బంతుల్లో 94పరుగులు చేసిన కెప్టెన్.. 208పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మూడో టీ20లోనూ అంతకుమించిన దూకుడుతో 29బంతులకు 70పరుగులు చేయడంతో భారత్ 3వికెట్ల నష్టానికి 240పరుగులు చేయగలిగింది. 

అదే దూకుడును శ్రీలంకతో మ్యాచ్‌లలోనూ చూపించాలని కోహ్లీ ఆతురతతో ఉన్నాడు. మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీ కొనసాగిస్తున్న ఫామ్ జట్టుకు లాభాన్ని తెచ్చిపెట్టడం ఖాయం. ఈ సిరీస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై విజయం తర్వాత జరుగుతుండటంతో టీమిండియా ధీటైన విశ్వాసంతో ఉంది. 

Squads:
India: Virat Kohli (c), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Rishabh Pant (wk), Ravindra Jadeja, Shivam Dube, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jasprit Bumrah, Navdeep Saini, Shardul Thakur, Manish Pandey, Washington Sundar, Sanju Samson.

Sri Lanka: Lasith Malinga (c), Dhanushka Gunathilaka, Avishka Fernando, Angelo Mathews, Dasun Shanaka, Kusal Perera, Niroshan Dickwella, Dhananjaya De Silva, Isuru Udana, Bhanuka Rajapaksa, Oshada Fernando, Wanindu Hasaranga, Lahiru Kumara, Kusal Mendis, Lakshan Sandakan, Kasun Rajitha