Telangana COVID 19 : 24 గంటల్లో 1280 కరోనా కేసులు..15 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.

Telangana COVID 19 : 24 గంటల్లో 1280 కరోనా కేసులు..15 మంది మృతి

Tg Covid 19

Updated On : June 13, 2021 / 8:28 PM IST

COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు. 24 గంటల్లో 2 వేల 261 మంది కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 78 వేల 748గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 21 వేల 137 గా ఉంది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –

ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 69. జీహెచ్ఎంసీ 165. జగిత్యాల 24. జనగామ 08. జయశంకర్ భూపాలపల్లి 16. జోగులాంబ గద్వాల 14. కామారెడ్డి 01. కరీంనగర్ 74. ఖమ్మం 156. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 40.

మహబూబాబాద్ 52. మంచిర్యాల 35. మెదక్ 05. మేడ్చల్ మల్కాజ్ గిరి 49. ములుగు 12. నాగర్ కర్నూలు 14. నల్గొండ 80. నారాయణపేట 05. నిర్మల్ 04. నిజామాబాద్ 17. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 14. రంగారెడ్డి 76. సంగారెడ్డి 38. సిద్దిపేట 46. సూర్యాపేట 59. వికారాబాద్ 25. వనపర్తి 18. వరంగల్ రూరల్ 29. వరంగల్ అర్బన్ 55. యాదాద్రి భువనగిరి 23. మొత్తం 1280.