BJP : తొలి జాబితాపై కమలనాథులు కసరత్తు పూర్తి… 35 నుంచి 40 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు, ఎవరెవరున్నారో తెలుసా?
ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు సార్లు చర్చించారు. అక్టోబర్ 16న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజున బీజేపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

BJP first list
BJP First List : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు మిగిలిన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. 50 శాతం సీట్లు కొలిక్కి వచ్చాయని త్వరలోనే తొలి జాబితా విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు తొలి జాబితాపై కమలనాథులు కసరత్తు పూర్తి చేశారు.
ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు సార్లు చర్చించారు. అక్టోబర్ 16న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజున బీజేపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 35 నుంచి 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసింది. అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.తొలి జాబితాలో ముఖ్య నేతల పేర్లు ఉండకపోవచ్చనే సమాచారం. గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Assembly Electoins 2024: ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. ఒకే నియోజకవర్గంలో 6 మండల అధ్యక్షులు రాజీనామా
కిషన్ రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, లక్ష్మణ్ పోటీపై క్లారిటీ లేదు. పోటీపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, లక్ష్మణ్ ఊగిలలాటలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నుంచి రఘునందన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వబోతుంది. ఆయన నియోజకవర్గాలు మారుతున్నారు, వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే కొంత చర్చ జరిగినా చివరికి ఆయన దుబ్బాక నుంచి పోటీ చేయాలనుకున్నారు. దీంతో రఘునందన్ రావుకు దుబ్బాక నుంచి పోటీ చేసే బీజేపీ ఇచ్చినట్లు సమాచారం.
హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేయడంతోపాటు ఉమ్మడి జిల్లా గజ్వేల్ లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీ నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. హూజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్ల ఈటల రాజేందర్ బరిలో దిగబోతున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు పోటీగా బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఆచారి పోటీ చేయనున్నారు. గతంలో కల్వకుర్తి నుంచి చాలా స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు.2014లో వంశీచందర్ రెడ్డిపై ఆచారి ఓడిపోయారు. ఆచారికి బీజేపీ మరోసారి అవకాశం ఇస్తుంది. అక్కడి నుంచి మళ్లీ బరిలో దిగబోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి దయానంద్ గౌడ్ కు టికెట్ ఇవ్వనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్ నుంచి మనోహర్ రెడ్డిని బరిలో దింపబోతుంది. తొలి జాబితాలోనే ఆయన పేరు రాబోతుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఆయన పేరు ఇప్పటికే ఫైనల్ అయింది. తొలి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించనున్నారు.
సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ నుంచి సుహాసిని, బోధ్ నుంచి సోయం బాపూరావ్, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ నుంచి రమేశ్ రాథోడ్, నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల లక్ష్మీనారాయణ, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు.
బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ, జుక్కల్ నుంచి అరుణ తార, జగిత్యాల నుంచి బోగి శ్రావణి, ధర్మపురి నుంచి వివేక్ వెంకటస్వామి, మంథని నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్ రావు, చొప్పదండి నుంచి బోడిగ శోభ, మానకొండూరు నుంచి ఆరేపల్లి మోహన్, వేములవాడ నుంచి వికాస్ రావు, సంగారెడ్డి నుంచి దేశ్ పాండే, ఆందోల్ నుంచి బాబూమోహన్ పోటీ చేయునున్నారు.