KCR : తెలంగాణ భ‌వ‌న్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.

KCR : తెలంగాణ భ‌వ‌న్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు

KCR

Telangana Bhavan : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. జై తెలంగాణ.. సీఎం కేసీఆర్.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగిపోయింది. అనంతరం కృష్ణా పరీవాహక జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించనుంది. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీశ్ రావు తదితరులు ఉన్నారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పలువురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు

అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ తన నివాసంలో కిందపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించి తుంటి సర్జరీ చేశారు. తుంటి సర్జరీ అనంతరం కేసీఆర్ ఇటీవల కోలుకున్నారు. దీంతో ఈనెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత పార్లమెంటరీ సమీక్షా సమావేశాల్లో కేసీఆర్ తరచూ పాల్గొంటున్నారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ సీఎం.. కేసీఆర్ సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు – హరీష్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, రానేరాదన్న తెలంగాణను 14ఏళ్లు పోరాడి సాధించిన నేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ సంక్షేమంకోసం, ప్రజల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటం చేస్తారు, రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజల కష్టాలు పట్టడం లేదు.. ప్రజలకు కష్టాలు పెరగడమే కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చిన మార్పు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.