V. Hanumantha Rao : రాష్ట్రంలో రైతులు చనిపోతే ఆర్ధికసాయం చేయని కేసీఆర్.. బీహార్, పంజాబ్ రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారు : వి.హనుమంతరావు

ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు.

V. Hanumantha Rao : రాష్ట్రంలో రైతులు చనిపోతే ఆర్ధికసాయం చేయని కేసీఆర్.. బీహార్, పంజాబ్ రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారు : వి.హనుమంతరావు

V. Hanumantha Rao

Updated On : July 5, 2023 / 2:21 PM IST

V. Hanumantha Rao Press Meet : కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. నరేంద్ర మోదీ బీసీలకు ఇప్పటివరకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లకు పని లేకుండా చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ లో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామని వెల్లడించారు.

High Court : దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిళ్లలో 5 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ

ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక సీఎం సిద్ద రామయ్యను ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పని ఖతం అయిందన్నారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో రైతులు చనిపోతే ఆర్ధిక సహాయం చేయని కేసీఆర్.. బీహార్, పంజాబ్ రైతులకు మాత్రం తెలంగాణ డబ్బులు ఇచ్చారని పేర్కొన్నారు. బీసీల్లో చైతన్యం వచ్చిందన్నారు. బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా మంచిదేని.. దాన్ని స్వాగతిస్తామన్నారు.