నిజామాబాద్లో గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమాన్యుడినని: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్రెడ్డి పేర్కొన్నారు.

Congress Leader Jeevan Reddy: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ను నిలువరించడాని బీజేపీ, BRS పార్టీలు కుట్ర పన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కుకోవడమేనని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమాన్యుడినని అన్నారు. గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని.. తనను రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
”బీజేపీ సిద్ధాంతం, ఆర్థికప్రణాళిక లేని పార్టీ. మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ. తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకం అయినా బీజేపీ పాలిత రాష్టాల్లో అమలవుతుందా? BRS పార్టీ నాయకులు రైతు దీక్షల పేరిట ధర్నాలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వరికి క్వింటల్కు 3000 రూపాయల మద్దతు ధర అందిస్తాం. ఎంపీ ఎన్నికల్లో BRS పార్టీని బీజేపీ దగ్గర కేసీఆర్ కుదుపెట్టారు. బీజేపీ హస్తల్లో ఉన్న పార్టీని విడిపించడానికి కేసీఆర్ రైతుదీక్షలు చేయిస్తున్నారు.
Also Read: ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరేలోగా.. వాటిని పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయం
ప్రభుత్వం నిర్మాణత్మాకంగా వ్యవహరిస్తే ప్రతిపక్షాలు సహకరించాలి. రుణమాఫీ చేసి, వరి పంటకు బోనస్ అందించి రైతులను అదుకుంటాం. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనా కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేసే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నారు. PDS బియ్యం పక్కదారి పట్టకుండా సన్న రకాలు ప్రోత్సహించేందుకు వరి పంటకు బోనస్ అందిస్తామ”ని జీవన్రెడ్డి అన్నారు.
Also Read: రైతు రుణమాఫీ ఎలా? సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్, ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?