KTR: బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్.. మళ్లీ కేసీఆర్ సీఎం అవ్వాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు.

KTR: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారాయన. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని క్యాడర్ కు సూచించారు కేటీఆర్. పోటీ చేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాన్నారు.
”పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. అభ్యర్థులకు అండగా ఉంటాం. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ హామీలు, మోసాల గురించి బీఆర్ఎస్ క్యాడర్ చెప్పాలి. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతాం. బాల్కొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ దారుణం.
రేషన్ కార్డులు ఇవ్వటం గొప్ప పని కాదు. అది ప్రభుత్వం బాధ్యత. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.
మల్కాజిగిరి లో ఇద్దరు కాంగ్రెస్ గూండాల ప్రవర్తనకు బుద్ధి చెప్తాం. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తే.. కాంగ్రెస్ గూండాలు లైన్ లోకి వస్తారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు .. రేవంత్ రెడ్డికి లొల్లి ఎక్కువ. ఆరు గ్యారంటీల్లో మూడు మోసాలను ప్రజలకు వివరించాలి.
ఒక్కో ముసలమ్మకు రేవంత్ ప్రభుత్వం 40 వేలు బాకీ ఉంది.
Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అద్దంకి దయాకర్ ఫైర్.. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కీలక కామెంట్స్..
పాలిచ్చే బర్రెను కాదని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారు. నాట్లప్పుడు కాకుండా.. ఓట్లప్పుడు రైతుబంధు వేసి సంబురాలు చేసుకోమంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక.. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవనీయం. ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో ప్రజలకు అర్థమైంది. కేసీఆర్ కు నిజమైన తమ్ముడిగా జగదీష్ రెడ్డి వీరోచిత పోరాటం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వానికి పార్టీకి సమ న్యాయం చేస్తాం” అని కేటీఆర్ అన్నారు.