ఒవైసి అయినా, మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే- కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు.

ఒవైసి అయినా, మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే- కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

Hydra : హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒవైసి బ్రదర్స్ సలకం చెరువులో నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్పొరేటర్లతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో కాలేజీలు కట్టి ఉంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.

Also Read : జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతకు హైడ్రా రెడీ..? రంగంలోకి ఇరిగేషన్ అధికారులు..

రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు. రంగనాథ్ ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు ఓల్డ్ సిటీ చెరువులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. చెరువును ఆక్రమించి ఒవైసి సోదరులు కట్టిన భవనాలను కూల్చేయాలన్నారు.