Eatala Rajender : అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం : ఈటల రాజేందర్

మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు.

Eatala Rajender : అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తి వేస్తాం, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం : ఈటల రాజేందర్

Eatala Rajender (2)

Eatala Rajender First Meeting : రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పేద భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తామని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పేదల పిల్లలకు నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే జిమ్మేదార్ బీజేపీదని స్పష్టం చేశారు.

మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులను ఎత్తి వేస్తామని, మనుషులను చంపే సంపాదన అవసరమా అని ప్రశ్నించారు.

Daggubati Purandheswari : అమర్ నాథ్ యాత్రలో బీజేపీ ఏపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి

పోలీసుల ఫైన్ల వేదింపులు నిలిపివేస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ అండతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించే బాధ్యత తమదన్నారు. తమ యావ, తమ చూపు పేదవాళ్ళ వైపేనని తేల్చి చెప్పారు. ఈ కురుక్షేత్రంలో కౌరవులపై విజయం మనదేనని, ప్రజలు ధర్మం వైపే ఉంటారని పేర్కొన్నారు.

మరోవైపు ఈటెల రాజేందర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తన మీద నమ్మకంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Nara Lokesh : యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది : నారా లోకేష్

నిబద్దతతో కార్యకర్తలతో కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంత కృషి చేస్తానని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే VIPలని, వారిని ఆశీర్వదిస్తున్న ప్రజల అండదండలతో నియంత్రత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపిచ్చారు.