Konda Surekha : సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. వీడియో వైరల్
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.
Konda Surekha CM Revanth Reddy
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పరకాల సీటు విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సురేఖ.. కొద్దిసేపు ఇటీవల జరిగిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Also Read : Nara Lokesh : మంత్రి నారా లోకేష్కు రాఖీ కట్టిన మంత్రి సవిత, ఎమ్మెల్యే గళ్లా మాధవి.. ఫోటోలు..
సీఎం రేవంత్ రెడ్డికి గతేడాది కూడా మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. గతేడాది కుమార్తె సుస్మిత పటేల్ తో కలిసి రేవంత్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అయితే, ఈసారి మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ మాత్రమే ఈసారి రేవంత్ నివాసానికి వెళ్లారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్నా. ప్రత్యేకంగా బంగారు రాఖీ చేయించి సీఎంకు కట్టా.. నేను అందరికీ ఆడపడచునే అని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు నేను మాట్లాడను. సీఎం రేవంత్ రెడ్డి మంచి పాలన అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.
