రాష్ట్రంలోని ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్.. ఎందుకంటే? జెనీవా ఒప్పందం ప్రకారం..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి భవనాలపై పెద్ద సైజులో రెడ్ క్రాస్ గుర్తును పెయింటింగ్ వేయిస్తారు.

రాష్ట్రంలోని ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్.. ఎందుకంటే? జెనీవా ఒప్పందం ప్రకారం..

Red Cross symbols

Updated On : May 9, 2025 / 2:18 PM IST

India Pakistan War: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి పాకిస్థాన్ ఆర్మీ భారత్ లోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్ల దాడికి ప్రయత్నించింది. అయితే, భారత్ ఆర్మీ వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రి భవనాలపై రెడ్ క్రాస్ సింబల్స్ పెయింట్ వేస్తున్నారు.

Also Read: IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

‘రెడ్ క్రాస్’ సింబల్ పెయింట్ ఎందుకు వేస్తారు..?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడి జరగకుండా ఉండేందుకు ఆస్పత్రి భవనాలపై పెద్ద సైజులో రెడ్ క్రాస్ గుర్తును పెయింటింగ్ వేయిస్తారు. దీని వల్ల విమానాలు, జెట్ లు, డ్రోన్లు ద్వారా ఆస్పత్రులను సులభంగా గుర్తించవచ్చు. జెనీవా ఒప్పందం ప్రకారం.. ఈ రెడ్ క్రాస్ గుర్తు ఉన్న భవనాలపై శత్రు దేశాలు దాడి చేయకూడదు. దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ.. పౌరులకు, సైనిక సిబ్బందికి అందే వైద్య సేవలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ఈ మానవతా ఒప్పందం చేసుకున్నాయి. 1949లో ఈ ఒప్పందం జరిగింది. ఎవరైనా అతిక్రమిస్తే దానిని యుద్ధ నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తారు. అందుకు తగిన చర్యలు ఆయా దేశాలపై ఉంటాయి.

Also Read: Gold Price Today: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ భారీగా తగ్గిన బంగారం ధర.. 10గ్రాముల గోల్డ్ పై ఎంత తగ్గిందంటే..?

అన్ని ఆస్పత్రులపై ఈ గుర్తు వేస్తారా..
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని మేజర్ ఆస్పత్రుల భవనాలపై రెడ్ క్రాస్ సింబల్ ను పెద్దసైజులో పెయింట్ వేస్తారు. ఇప్పటి వరకు 164 వైద్య, ఆరోగ్య శాఖ భవనాలపై ఈ సింబల్స్ ను పెయింటింగ్ చేయించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 51 ఆస్పత్రులు ఉండగా.. 47 ఆస్పత్రుల్లో రెడ్ క్రాస్ పెయింటింగ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 124 ఆస్పత్రులు ఉండగా.. ఇప్పటి వరకు 112 ఆస్పత్రుపై రెడ్ క్రాస్ సింబల్ వేశారు. సీఎంఎస్ పరిధిలో 33 ఆస్పత్రులు ఉండగా ఐదు ఆస్పత్రులపై రెడ్ క్రాస్ సింబల్ పెయింటింగ్ పూర్తి చేశారు. మిగిలిన ఆస్పత్రుల్లో రెండ్రోజుల్లో పెయింటింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.