3 రోజులు ఎన్నో మధురానుభూతులు.. కొల్లాపూర్‌లో గ్రాండ్‌గా RID స్వర్ణోత్సవ వేడుకలు

మూడో రోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శివమణి పాల్గొన్నారు.

3 రోజులు ఎన్నో మధురానుభూతులు.. కొల్లాపూర్‌లో గ్రాండ్‌గా RID స్వర్ణోత్సవ వేడుకలు

Updated On : December 1, 2024 / 7:41 PM IST

అపూర్వ సమ్మేళనానికి కొల్లాపూర్‌ వేదికగా మారింది.. రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్‌ కాలేజీ.. స్వర్ణోత్సవాలతో పులకించిపోయింది. కొల్లాపూర్‌ను కొహినూర్‌ వజ్రంలా మార్చడమే RID గోల్డెన్‌ జూబ్లీ వేదిక లక్ష్యమన్నారు పూర్వ విద్యార్థులు. ఈ స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్థులు అభినందించారు.

సృష్టిలో స్నేహమొక స్రవంతి. మధురమైన అనుభూతులను పంచుతుంది. కొల్లాపూర్‌లోని రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ సంబురాలను చూస్తే… ఆ అనుబంధమే కనిపించింది. పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నవంబర్‌ 27 నుంచి 29వ తేదీ వరకు జరిగాయి… ఈ వేడుకలు.. వైభవంగా మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఒకరినొకరు పలకరించుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. అంతేకాదు, RID మీద రాసిన ప్రత్యేక పాటతో అలరించారు ఓ పూర్వ విద్యార్ధి.

RID గోల్డెన్‌ జూబ్లీ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ ప్రారంభోత్సవంలో.. మైహోం ఛైర్మన్‌ రామేశ్వరరావు దంపతులతో పాటు, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత కటికనేని సాయి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిట్స్‌ వీసీ, మాజీ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. రామ్‌గోపాలరావు, హార్వార్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కే జయరాం రెడ్డి, రాజా ఆదిత్య లక్ష్మరావు, ప్రొఫెసర్‌ ఎం బాలరామ్‌ ఇతర పూర్వ విద్యార్ధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇంతటి మహామహుల తోడ్పాటుతోనే RID స్కూలుకు పూర్వవైభవం వచ్చిందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు….

ఈ హై స్కూలును మరువలేం: జూపల్లి రామేశ్వరరావు
మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. గత జ్ఞాపకాలను తలచుకుంటూ ముందుకు సాగుదామన్నారు. సంస్కారం, చదువు ఇచ్చిన రాణి ఇందిరా దేవి హై స్కూలును మరువలేమన్నారు. ఆ సంస్కారంతోనే ప్రతీ ఒక్కరూ భావితరాలకు మరింత తోడుగా నిలువాలని ఆకాంక్షించారుపూర్వ విద్యార్ధులు.. 2వేల మందికిపైగా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చారు. పాత మిత్రులను కలుసుకుని ఉప్పొంగిపోయారు. తమ గురువులను సత్కరించారు. అంతేకాదు, 50 ఏళ్ల నుంచి చదువుకుంటున్న ఒక్కో బ్యాచ్‌ను వేదికపై పిలిచి RID అవార్డులతో సన్మానించారు. సాయంత్రం RID గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో సాంస్కృతిక ఉత్సవాలు అలరించాయి.

మూడు రోజుల పాటు జరిగిన RID స్వర్ణోత్సవాలలో ప్రధానంగా మొదటి రోజు ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక పాత్ర పోషించారు. తర్వాత రెండో రోజు సినీనటుడు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. దీంతో కొల్లాపూర్ పట్టణంలో మారింత సందడిగా మారింది. మూడో రోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శివమణి పాల్గొన్నారు. దీంతో కొల్లాపూర్ పట్ణణంలో మారింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా తమన్ మైహోం సంస్థల అధినేత రామేశ్వర్ పై పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. సీనీ గ్లామర్ తో RID స్వర్ణోత్సవాలు మారింత జోష్ నింపింది.

Priyanka Gandhi: ఆ శక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం: ప్రియాంకా గాంధీ