తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.

Mlc Elec
MLC election : తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం… ఈ రెండింటికీ… ఆదివారం పోలింగ్ జరగనుంది. ప్రచారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. అన్ని పార్టీలు.. పట్టభద్రులను ఆకట్టుకోవడానికి చివర దశ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటాల తూటాలు పేలాయి. ప్రధాన పార్టీలు… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. అభ్యర్థుల గెలుపును ఆయా పార్టీల కీలక నేతలు తమ భుజస్కందాలపై వేసుకున్నారు.
రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. దీంతో జంబో బ్యాలెట్ను అధికారులు సిద్ధం చేశారు. 93 మంది అభ్యర్థుల్లో 13 మంది వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తుండగా 80 మంది ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు. ఈ సెగ్మెంట్లో మొత్తం 5 లక్షల 31 వేల 268 మంది ఓటర్లున్నారు. రంగారెడ్డిలో అత్యధికంగా లక్షా 44వేల 416 మంది ఓటర్లుండగా.. అత్యంత తక్కువగా నారాయణ పేట్ జిల్లాలో 13వేల 899మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి రెండు బాక్సుల చొప్పున 16వందల బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు.
అటు వరంగల్ – ఖమ్మం- నల్లగొండ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈసారి ఎన్నికల్లో 71 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 16 మంది పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మిగిలిన 55 మంది ఇండిపెండెట్లుగా బరిలో ఉన్నారు. ఈసారి అభ్యర్థులతోపాటు ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల 81 వేల 138 ఓట్లు ఉండగా.. లక్షా 53వేల 547ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఓటర్ల సంఖ్య 5 లక్షల 5వేల 565కు చేరడంతో పోలింగ్శాతం పెంచుకోగలిగితే తప్ప గట్టెక్కలేమన్న అంచనాల్లో అభ్యర్థులున్నారు.