బ్రేకింగ్ : తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 10:39 AM IST
బ్రేకింగ్ : తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్

Updated On : December 31, 2019 / 10:39 AM IST

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం కేసీఆర్ నియమించారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో సోమేష్ కుమార్ మూడున్నరేళ్ల పాటు(2023 డిసెంబర్ 31) కొనసాగనున్నారు. కాగా నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఎస్కే జోషిని నియమించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన ఎస్‌కే జోషి.. ఈ నెలాఖరుకు రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు. ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర సర్వీస్‌లో ఉంటే.. మరికొందరు కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల్లో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చివరికి అదే జరిగింది.

సీఎస్ పదవి రేసులో సీనియర్‌ ఐఏఎస్‌లు అజయ్‌ మిశ్రా, సోమేష్ కుమార్‌, రాజేశ్వర్‌ తివారీ, శాంతికుమారి, చిత్రా రామచంద్రన్‌ల పేర్లు వినిపించాయి. అలాగే అధర్‌ సిన్హా, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, వసుధా మిశ్రా, షాలినీ మిశ్రా, బీపీ ఆచార్యల పేర్లూ వినపడ్డాయి. అయితే సీఎం కేసీఆర్ కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని తెలిసింది. దీంతో సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేశ్‌ కుమార్‌ మధ్య ప్రధాన పోటీ ఉందని అధికార వర్గాల్లో వినిపించింది. చివరికి సోమేష్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు.