Telangana Covid Latest News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

తెలంగాణలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. క్రితం రోజుతో (17) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. (Telangana Covid Latest News)

Telangana Covid Latest News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Telangana Covid Report

Updated On : April 22, 2022 / 9:13 PM IST

Telangana Covid Latest News : తెలంగాణలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. క్రితం రోజుతో (17) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 265 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 20 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇంకా 199 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 91వేల 741 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 431 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 14వేల 337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 17 మందికి పాజిటివ్ గా తేలింది.

Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

అటు దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 2 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీల కంటే.. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసులు పైపైకి వెళ్తున్నాయి.

గురువారం 4.48 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 451 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న ఢిల్లీలో 965 కేసులు రాగా.. కేరళ, హరియానాలో 300 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో మరో 54 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళ ప్రకటించిన మృతుల సంఖ్య 48. ఇప్పటివరకూ 4.30 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా.. 5.22 లక్షల మంది చనిపోయారు.

Delhi : మళ్లీ కరోనా ఆంక్షలు.. మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. నిన్న మరో 1,589 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 14,241 (0.03 శాతం)కి పెరిగాయి. రికవరీ రేటు 98.75 శాతానికి తగ్గింది. ఇక నిన్న 18 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. మొత్తంగా 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.