Telangana Corona Cases : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

COVID19 cases in India

Updated On : July 8, 2022 / 8:45 PM IST

Telanganan Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజే 600లకిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు, మంగళవారం(జూన్ 28) 459 కేసులు, గురువారం(జూన్ 30) 468 కేసులు, శుక్రవారం(జులై 1) 462 కేసులు, శనివారం(జులై 2) 516 కేసులు, ఆదివారం(జులై 3) 457 కేసులు, సోమవారం(జులై 4) 443 కేసులు, మంగళవారం (జులై 5) 552 కేసులు, బుధవారం (జులై 6) 563 కేసులు, గురువారం(జులై 7) 592 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 608గా(జులై 8) ఉంది.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 055 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 608 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 329 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 67, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, సంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 459 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Zika Virus : తెలంగాణలో జికా వైరస్ టెన్షన్.. అసలే వర్షాకాలం జర భద్రం!

రాష్ట్రంలో నేటివరకు 8,05,137 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 95వేల 880 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ ను తాకడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 146కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.