ఐరన్ లెగ్.. నువ్వా నా గురించి మాట్లాడేది.. మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను.

ఐరన్ లెగ్.. నువ్వా నా గురించి మాట్లాడేది.. మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

YS Sharmila Slams Minister Roja

YS Sharmila : నగరి బహిరంగ సభలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మంత్రి రోజాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారా? అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు షర్మిల. ఒక్క నిమిషం పాటు.. నేను వైఎస్ఆర్ బిడ్డను కాదనుకోండి.. మీకు దమ్ముంటే ఏం చేస్తారో రండి అంటూ సవాల్ విసిరారు షర్మిల.

ఏమైంది ఆ రత్నం?
మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ చెప్పారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తైందా? తట్టెడు మట్టె మళ్లీ ఎత్తి ఇటు పోశారా? జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డికి ప్రాణం అయితే.. అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా? జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అన్నారు. నవరత్నాల్లో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడికి పోయింది జలయజ్ఞం.

Also Read : వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది

నియంతల భరతం పడతాం
నా పుట్టింటికి అన్యాయం జరుగుతోంది కాబట్టి, ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నామీ కూడా ఉంది కాబట్టి.. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చా. తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు, పోరాటానికి అక్కడ ఒక నియంతను దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంతను దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్లీ ఇక్కడ అడుగుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట. అవి నేను తీసుకురావాలట. ఏమ్మా.. నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా?

ఏమ్మా.. మరిచిపోయావా?
మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అనే పేరుతో పిలవబడినప్పుడు.. రాజశేఖర్ రెడ్డిని మీరు ఎంతగా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తే ఉంది. రాజశేఖర్ రెడ్డి లాంటి మహామనిషిని పట్టుకుని ఆయన గురించి మాట్లాడిన మాటలు, పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి పంచె విప్పి కొడతాను అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ.. ఈ రోజా.. నా గురించి మాట్లాడుతుందా? రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దు.

మీ దమ్ము ఏంటో చూపించండి..
రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి నన్ను అడుగు బయటపెట్టినిచ్చారని ఒకరు అన్నారు. ఒక నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి. ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి.

Also Read : బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ కోసం పోటీ? ధర్మవరం తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం

మొక్కను చెట్టును చేశా..
నేను ఇక్కడికి వచ్చి మీ తప్పులను ఎత్తి చూపుతున్నానని, చెల్లెలిని అని ఇంగితం లేదు. ఇదే పార్టీని 3వేల 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులు ఉన్నాయి. సమైక్యాంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను. అలాగే బై బై బాబు అనే క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేశాను. నాకు ఈ పదవి కావాలి అని నోరు తెరిచి అడగకుండానే.. వాళ్లకు ఏ అవసరం ఉంటే అది చేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టు అయ్యింది. చెట్టు అయ్యాక నా అవసరమే లేదంటున్నారు కదా.