కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు వేర్వేరు జీవోలు జారీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 10:24 AM IST
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు వేర్వేరు జీవోలు జారీ

Updated On : December 4, 2019 / 10:24 AM IST

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లి-పెద్దనందలూరు మధ్య ప్లాంట్ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (డిసెంబర్ 4, 2019) ఉత్వర్వులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం జగన్ (డిసెంబర్26, 2019) శంకుస్థాపన చేయనున్నారు. 

ప్రైవేట్ పెట్టుబడిదారులతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే ప్రభుత్వమే ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని జీవోలో పేర్కొంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 2013 కంపెనీల చట్ట ప్రకారం హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో రూ.10 లక్షల మూలధనంతో కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. 

వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇబ్రహీంపట్నంలోని ఇన్ క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా పేర్కొంది. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్ ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.