విశాఖ రాజధాని, కర్నూలులో హైకోర్టు : సీఎం జగన్ చెప్పిందే జీఎన్ రావు కమిటీ చెప్పింది
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు స్వాగతిస్తే, కొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు త్రీ కేపిటల్ ఫార్ములాని తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు అని నినదించారు. ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొననసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, మూడు రాజధానులతో మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణకు, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని సూచించింది. పరిపాలన సౌలభ్యం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని కోరింది. రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ.. శుక్రవారం(డిసెంబర్ 20,2019) తన తుది నివేదికను సీఎం జగన్ కి ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎంని కలిసి నివేదికను అందజేశారు. రిపోర్టులోని ముఖ్యమైన అంశాలను సీఎం జగన్కు వివరించారు.
ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. నివేదికలో తాము చేసిన కీలక సూచనలు, సిఫార్సులను వివరించారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయన్న కమిటీ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కీలక సూచనలను చేశామని తెలిపింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు.
రాజధానిపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్గా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులతో కూడిన కమిటీ వేసింది. కమిటీ సభ్యులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
సీఎం జగన్ చెప్పినట్టే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తాము నివేదికలో సూచించామని జీఎన్ రావు కమిటీ సభ్యులు తెలిపారు. విశాఖలో హైకోర్టు బెంచ్, సీఎంవో, సెక్రటేరియట్, వేసవిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సిఫారసు చేసింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించి, నదికి దూరంగా ఉన్న మంగళగిరి ప్రాంతంలో పాలన భవనాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అమరావతి ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. మంత్రుల క్వార్టర్స్, రాజ్ భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంటాయి.
రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ చేసిన సిఫార్సులు:
* పరిపాలన సౌలభ్యం కోసం 4 రీజియన్ లుగా ఏపీ విభజన
* ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా విభజన
* పరిపాలన రాజధానిగా విశాఖ
* విశాఖలో సీఎంవో, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
* అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్
* కర్నూలులో హైకోర్టు, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు, సీఎం క్యాంప్ ఆఫీస్
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాము
* ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి
* కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి
* వరద ముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించాం
* సహజ వనరులు అన్ని ప్రాంతాలకు అందాలి
* అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి
* జిల్లాల్లోని అన్ని వర్గాలతో సమావేశం అయ్యాం
* తుళ్లూరులో కొన్ని జోన్లు వరద ప్రభావానికి గురవుతాయి
* ఆ ప్రాంతాల్లో తప్పు మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సూచించాం
* విశాఖ, అమరావతి నుంచి లెజిస్లేచర్ వ్యవస్థ పని చేయొచ్చని సూచన
* అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా చూడాలి
* ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు
* శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం ఒక మండలిగా..
* కృష్ణా, గోదావరి జిల్లాలు మరో మండలిగా..
* గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మూడో మండలిగా..
* సీమ నాలుగు జిల్లాలు మండలిగా ఏర్పాటు చేయాలని సూచన
*వరద ముప్పు లేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచన