సీబీఎన్ ఆర్మీపై బీరు బాటిళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

  • Published By: vamsi ,Published On : April 8, 2019 / 04:07 AM IST
సీబీఎన్ ఆర్మీపై బీరు బాటిళ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

Updated On : April 8, 2019 / 4:07 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశంకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సీబిఎన్ ఆర్మీకి చెందిన యువకులకు గాయాలు అయ్యాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు. ఘటన గురించి తెలియగానే.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని బాధితులను పరామర్శించారు.

తమపై వైసీపీ కార్యకర్తలు  30మంది బీరు బాటిళ్లతోదాడి చేశారని సీబీఎన్ ఆర్మీ సభ్యులు ఆరోపించారు. దాడి చేసినవారంతా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులని అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఓటమి భయంతోనే చెవిరెడ్డి దౌర్జన్యాలకు దిగుతున్నారని.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే వాళ్లకు ఓట్లు వేస్తే రౌడీయిజం పెరిగిపోద్దని పులివర్తి నానీ విమర్శించారు. బయట నుంచి మనుషులను తీసుకుని వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.