వెంకన్నపై అంబానీ భక్తి : 1,11,11,111 విరాళం 

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 09:31 AM IST
వెంకన్నపై అంబానీ భక్తి : 1,11,11,111 విరాళం 

తిరుమల : ఆపదమెక్కుల వాడు తిరుమల వెంకన్నపై అంబానీ తన భక్తిని భారీ విరాళం ద్వారా చాటుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 1,11,11,111 ని విరాళంగా ఇచ్చారు.  ఈ  విరాళాన్ని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు పీఎంఎస్‌ ప్రసాద్‌ శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం జేఈవో శ్రీనివాసరాజుకు డీడీ రూపంలో  అందజేశారు. 

ఈ మొత్తాన్ని ప్రాణాపాయంలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడాలని కోరుతూ ప్రాణదానం ట్రస్టు కింద జమచేయాలని టీటీడీ అధికారులను పీఎంఎస్‌ ప్రసాద్‌ కోరారు. కాగా 2018లో కూడా ముఖేశ్ అంబానీ శ్రీవారికి రూ. కోటి 11 లక్షల మొత్తాన్ని శ్రీవారికి సమర్పించారు. కాగా..అపర కుబేరుడుగా పేరొందిన ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ-రోజీ బ్లూ డైమండ్స్ సీఈవో రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన ఈ వివాహ వేడుకలకు సినీ తారలతో పాటు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా విచ్చేసారు.