వైరల్ ఫోటో: కియారా అద్వానీని ముద్దు పెట్టుకున్న సుశాంత్ సింగ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు ఇంకా బాలీవుడ్ వర్గాల్లో మిస్టరీగానే ఉండగా.. ఈ కేసు విషయంలో సీబీఐ కీలక ఆధారాలు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలు వెల్లడి కాగా.. కొన్ని అరెస్ట్లు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్గా సుశాంత్కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సుశాంత్ యొక్క మరొక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సుశాంత్ సింగ్.. నటి కియారా అద్వానీని ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది. అంతకుముందు సుశాంత్కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయ్యింది, అందులో అతను అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్ ఆకాన్షా రంజన్ను ముద్దు పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో 2016 నాటిది. అప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజులో ఈ ఫోటో తీశారు. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో హీరోయిన్ అయిన కియారా అద్వానీతో కలిసి కనిపించారు. కియారా అద్వానీ ఈ అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
View this post on Instagram
This is what happens when you meet @sushantsinghrajput after a long time #SushAttack ?