covid-19 Vaccination : 100 శాతం వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న రాష్ట్రం..
గోవా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతున్న క్రమంలో గోవా రెండు డోసులు వేసి వ్యాక్సినేషన్ ను 100 శాతం పూర్తి చేసింది.
Goa 100 percent covid 19 Vaccination target : గోవా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతున్న క్రమంలో గోవా రెండు డోసులు వేసి వ్యాక్సినేషన్ ను 100 శాతం పూర్తి చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో వ్యాక్సినేషన్ అందించే విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్ అందించింది.
Also read : Antibodies : వ్యాక్సిన్ తరువాత వ్యాయామంతో….మెరుగైన రోగనిరోధక కణాలు
100 శాతం పూర్తి కావటంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని గోవా ఆరోగ్యశాఖ బుధవారం (ఫిబ్రవరి 16,2022) వెల్లడించింది. ఈక్రమంలో గోవా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని కోవిడ్-19 టీకా కేంద్రాలను మూసివేసి..సాధారణ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో..సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
Also read : Covid Vaccine: శాస్త్రవేత్తల సిఫార్సు ఉంటేనే 5-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్: కేంద్ర మంత్రి
డాక్టర్ గోవాలోని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ఇరా అల్మేడా పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ..‘రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ గతేడాది సెప్టెంబర్లోనే ఒక డోసు అందించాం. వ్యాక్సిన్కు అర్హులైన వారు రాష్ట్రంలో మొత్తం 11.66లక్షల మంది ఉండగా వారందరికీ రెండు డోసుల్లో పంపిణీ చేశాం. అయినప్పటికీ గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వ్యాక్సిన్ అందిస్తాం. భారీ వర్షాలు, తుపాను సమయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్ను కొనసాగించాం. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’ అని గోవా స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర బోర్కర్ పేర్కొన్నారు.
Also read : Corona Vaccines: భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ ధరలు
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 173 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అర్హులైన వారిలో 96శాతం మందికి తొలిడోసు అందించగా.. దాదాపు 75 శాతానికిపైగా రెండు డోసులు తీసుకున్నారు. మరో కోటి 79 లక్షల మందికి మూడో డోసు అంటూ బూస్టర్ డోసును అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.