Telangana Corona: తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Corona: తెలగాణలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24వేల 576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 154 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ లో 52 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో మరో 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు.

ఇప్పటిదాకా తెలంగాణలో(Telangana Corona) మొత్తం 7,89,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,82,519 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 2వేల 607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 152 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

ఏపీలో కరోనావైరస్ (Telangana Corona) మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 458 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రితంరోజు 6 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు.. తాజాగా స్వల్పంగా పెరిగాయి. నిన్న 7,84,059 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7వేల 554 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో మరో 223 మంది కోవిడ్ తో మరణించారు. ఈ రెండేళ్ల కాలంలో 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. నేటివరకు దేశంలో 5,14,246 మంది కోవిడ్ తో చనిపోయారు.

కొంతకాలంగా కొవిడ్ వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో.. యాక్టివ్ కేసులు లక్ష దిగువకు చేరాయి. ప్రస్తుతం అవి ఇంకాస్త తగ్గి.. 85,680కు క్షీణించాయి. దాంతో మొత్తం కేసుల్లో వైరస్‌తో బాధపడుతున్న వారు 0.20 శాతానికి తగ్గిపోయారు. రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది. నిన్న 14,123 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. ఇక నిన్న 8.5 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 177 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా వివరాలు తెలిపింది.

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.