Anam Venkata Ramana Reddy : మా ప్రభుత్వం వస్తే మేమేంటో చూపిస్తాo- వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్

Anam Venkata Ramana Reddy : అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు.

Anam Venkata Ramana Reddy : మా ప్రభుత్వం వస్తే మేమేంటో చూపిస్తాo- వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్

Anam Venkata Ramana Reddy (Photo : Google)

Anam Venkata Ramana – Lokesh : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేశారు.

ఈ దాడి వైసీపీ మూకల పనే అని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు అని లోకేశ్ ప్రశ్నించారు. తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

Also Read..Chandrababu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ

”వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే నాపై దాడి జరిగింది. మా ప్రభుత్వం వస్తే మేమేందో చూపిస్తాo. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. పోలీసులు సరిగా స్పందించడం లేదు” అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

నెల్లూరులో కలకలం రేగింది. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నం చేశారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. తన ఆఫీసు నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడికి యత్నం జరిగింది. కొందరు దుండగులు వాటర్ ట్యాంక్ వెనుక మాటు వేశారు. వారు ముఖానికి కర్చీఫ్ లు కట్టుకున్నారు. చేతిలో దుడ్డు కర్రలతో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఇంతలోనే అప్రమత్తమైన ఆనం వెంకటరమణారెడ్డి తప్పించుకుని ఆఫీసులోకి వెళ్లిపోయారు.

వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు దుండగులను ప్రతిఘటించారు. వారిని పట్టుకునేందుకు వెంబడించారు. దాంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి యత్నించారని ఆనం అనుచరులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ విమర్శలు చేసినందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దాడికి యత్నించారని చెప్పారు.

Also Read..Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

ఇటీవలి కాలంలో సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ విధానాలు, వైసీపీ నాయకులపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు దాడికి యత్నించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఘటనా స్థలానికి వచ్చారు చేరుకున్నారు. వెంకటరమణారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.