Vikarabad Sirisha Case : సంచలనం రేపిన శిరీష దారుణ హత్య కేసులో వీడిన మిస్టరీ, హంతకుడు ఎవరో తెలిసి అంతా షాక్

Vikarabad Sirisha Case : శిరీషను కొట్టి నీటిలో బలవంతంగా ముంచి హతమార్చాడు. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కుని శిరీష కోసం ఏమీ తెలియనట్లు వెతికాడు.

Vikarabad Sirisha Case : సంచలనం రేపిన శిరీష దారుణ హత్య కేసులో వీడిన మిస్టరీ, హంతకుడు ఎవరో తెలిసి అంతా షాక్

Vikarabad Sirisha Case (Photo : Google)

Nursing Student Sirisha : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా నర్సింగ్ విద్యార్థిని శిరీష దారుణ హత్య కేసులో మిస్టరీ వీడింది. శిరీషను అత్యంత దారుణంగా హత మార్చింది ఆమె బావ అనిల్ అని పోలీసుల విచారణలో తేలింది. శిరీష దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకల రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేశారు.

శిరీషను అనుభవించాలని కోరిక..
మూడు రోజులు దర్యాప్తు జరిపి శిరీష హత్య కేసు చేధించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శిరీష బావ అనిల్ అని ఆయన చెప్పారు. ఈ నెల 11న హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. శిరీషను పెళ్లి చేసుకోవాలని, శారీరకంగా అనుభవించాలని నిందితుడు అనిల్ కు కోరిక ఉందన్నారు.

బీర్ బాటిల్‌తో కొట్టి..
‘సెల్ ఫోన్ గురించి ఇంట్లో గొడవ జరిగింది. ఆ రోజు శిరీష అనిల్ ను తిట్టింది. గొడవ తర్వాత శిరీష అందరినీ మభ్యపెట్టి గడియ పెట్టి రాత్రి వెళిపోయింది. కట్ట మైసమ్మ గుడి దగ్గర శిరీషను అనిల్ గమనించాడు. తాగిన మైకంలో ఉన్న అనిల్.. శిరీషను రాత్రి 11:30 గంటల సమయంలో బీర్ బాటిల్ తో కొట్టాడు. దాంతో రెండు కళ్లల్లో గుచ్చుకున్నాయి.

కాళ్లు, చేతులు కడుక్కుని..
ఆ తర్వాత శిరీషను నీటి కుంటలోకి తీసుకెళ్లి చంపాడు. శిరీషను కొట్టి నీటిలో బలవంతంగా ముంచి హతమార్చాడు. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కుని శిరీష కోసం ఏమీ తెలియనట్లు వెతికాడు. నిందితుడు అనిల్ నేరాన్ని అంగీకరించాడు. రాజు అనే వ్యక్తిపై నేరాన్ని నెట్టాలని అనిల్ ట్రై చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి శిక్ష పడేలా చూస్తాము. ఈ నెల 11న శిరీష తమ్ముడు అక్క శ్రీలతకు ఫోన్ చేసి శిరీష కనిపించడం లేదని చెప్పాడు. నిందితుడు అనిల్ పై గతంలో(2015) ఐపీసీ సెక్షన్ 307 పరిగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది” అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

Also Read..Bengaluru : 30 బీపీ ట్యాబ్లెట్లు మింగించి .. తల్లిని చంపిన మహిళ కేసులో సంచలన విషయాలు

కళ్లు పొడిచి, గొంతుకోసి.. దారుణ హత్య..
వికారాబాద్ లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కళ్లు పొడిచి, గొంతుకోసి అత్యంత కిరాతకంగా, భయానకంగా శిరీషను చంపారు. ఈ హత్య జరిగిన తీరు ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో 19ఏళ్ల బాలిక శిరీష దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తి చేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్‌ ట్రైనింగ్ తీసుకుంటోంది. జూన్​ 10న అర్ధరాత్రి వరకు ఇంట్లోనే ఉన్న శిరీష.. తెల్లారే సరికి ఇంట్లో కనిపించలేదు. కంగారుపడిన కుటుంబసభ్యులు ఊరంతా వెతికారు. కానీ, శిరీష ఆచూకీ లేదు.

తీరా.. మధ్యాహ్నం గ్రామ శివారులో ఉన్న నీటికుంట దగ్గర శిరీష దుస్తులు కనిపించాయి. చెరువులో చూడగా.. శిరీష మృతదేహం తేలుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు శిరీష మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయపడిపోయారు. అంత దారుణంగా ఉంది. శిరీష రెండు కళ్లను పదునైన వస్తువుతో పొడిచారు. మరో పదునైన వస్తువుతో గొంతు కోశారు. శిరీష ఒంటిపై గాయాలున్నాయి. అత్యంత క్రూరంగా, భయానకంగా శిరీషను చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి మర్డర్ మిస్టరీని చేధించారు.

Also Read..Uttar Pradesh: మోదీ-యోగీ రాజకీయాలపై చర్చ.. కారుతో ఢీకొట్టి చంపిన డ్రైవర్