Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం

మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.

Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం

man killed (1)

Family Members Kill Man : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గాలిపెళ్లి అశోక్(38) దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కిటికీలోంచి అశోక్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు. అశోక్ ను గత 10 రోజుల క్రితమే హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, ప్రాణ భయం ఉందని పోలీస్ స్టేషన్ లో అశోక్ ఫిర్యాదు చేశారు.

Delhi : ప్రేమించాడని.. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే దారుణ హత్య, ఒళ్లుగగుర్పొడిచే వీడియో

హత్యకు గురైన అశోక్, అతని బావ, తమ్ముడు, చెల్లెలు పథకం ప్రకారం హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు. అశోక్ మృతికి అస్తి పంపకాలే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అశోక్ బావ అనిల్, తమ్ముడు నరేష్, చెల్లెల్లు పుష్పలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.