Congress – YSRTP : కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై కసరత్తులు.. షర్మిల తెలంగాణలో పనిచేయడంపై రేవంత్ ససేమిరా, బుజ్జగిస్తున్న డీకే శివకుమార్

రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పార్టీలో చేర్చుకుంటే 2018 ఎలక్షన్ రిపీట్ అవతుందని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Congress – YSRTP : కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై కసరత్తులు.. షర్మిల తెలంగాణలో పనిచేయడంపై రేవంత్ ససేమిరా, బుజ్జగిస్తున్న డీకే శివకుమార్

YSRTP merger Congress Party

YSRTP Merger Congress Party : కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ విలీనంపై వేగంగా కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే వైఎస్ఆర్ షరిష్మా పనికి వస్తుందంటూ అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పడంతో వైఎస్ఆర్ టీపీ విలీనంపై అన్ని విధాలుగా అధిష్టానం సుముఖంగా ఉంది.

అయితే షర్మిల తెలంగాణలో పని చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ససేమిరా అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను అధిష్టానం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు అప్పగించింది. డీకే శివకుమార్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే షర్మిలను పార్టీలో చేర్చుకుంటే 2018 ఎలక్షన్ రిపీట్ అవతుందని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

YS Sharmila : టీకాంగ్రెస్ లో షర్మిల కల్లోలం.. తెలంగాణలో షర్మిల రాజకీయానికి నో చెబుతున్న రేవంత్

షర్మిల అంశంలో మొదటి నుంచి మధ్యవర్తిత్వానికే డీకే శివకుమార్ ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ సందేహాలను నివృత్తి చేస్తూ అధిష్టానం ఆలోచనలను వివరించినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ లో షర్మిల కల్లోలం రేపుతోంది. బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్ షర్మిల మొదలు పెట్టారు. షర్మిల పార్టీ విలీనం దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి.

షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తో చర్చించే బాధ్యతను అధిష్టానం డీకే శివకుమార్ కు అప్పగించించింది. నిన్న డీకే శివకుమార్ తో రేవంత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై బెంగళూరులో కీలక భేటీ అయ్యారు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చర్చల్లో పాల్గొననున్నారు. అయితే, తెలంగాణలోనే రాజకీయం చేయాలనే యోచనలో షర్మిల ఉన్నారు. కానీ, తెలంగాణలో షర్మిల రాజకీయం చేయడాన్ని రేవంత్ రెడ్డి నిరాకరిస్తున్నారు.

YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

ఏపీ రాజకీయాలకే షర్మిలను పరిమితం చేయాలని అంటున్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించారు. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్ కు షర్మిల అస్త్రంగా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలేరులో పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించని విషయం తెలిసిందే. దీంతో షర్మిలకు చెక్ పెట్టేందుకు తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ తెరపైకి తెచ్చారు.

మొన్న (గురువారం) ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. షర్మిల రాజకీయ భవిష్యత్ పై సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిలకు జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో షర్మిల కీ రోల్ గా ఉన్నారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ? కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల

రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలను సోనియాకు షర్మిల వివరించారు. కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ విలీనం చేసేందుకు సిద్ధమని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం పార్టీ విలీనానికి షర్మిల సిద్ధమయ్యారు. కానీ, రాహుల్ గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండటంతో పార్టీ విలీనం వాయిదా పడింది.