Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం](https://10tv.in/wp-content/uploads/2023/09/Tamil-Nadu-Road-Accident.jpg)
Tamil Nadu Road Accident
Road Accident Seven Women Died : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మినీ బస్సును ఏచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మినీ బస్సు రోడ్డు డివైడర్ పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 మంది మహిళలు దుర్మరణం చెందారు.
మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని చండీయార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.