Asian Games : భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అదరగొట్టిన రోహన్ బొపన్న- రుతుజ జోడీ
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది.
Asian Games 2023 : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్.. పతకాల పంట పండిస్తోంది. టెన్నిస్ విభాగంలో దేశానికి మొదటి గోల్డ్ మెడల్ లభించింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత్కు చెందిన రోహన్ బోపన్న- రుతుజా భోసలే జోడీ తైఫీకి చెందిన సంగ్-లియాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో గెలుపొందింది. తద్వారా స్వర్ణ పతకం గెలుచుకుంది. దీంతో భారత్ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అంతకముందు.. సరబ్జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడి షూటింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ జోడి పతకం గెలుచుకుంది. దీంతో షూటింగ్ విభాగంలో పతకాల సంఖ్య 19కి చేరుకుంది.