BJP : 18న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల? 30 నుండి 35 సీట్లు వారికే..!

తొలి నుంచి పార్టీలో బీసీలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న బీజేపీ ఆ సామాజికవర్గానికి చెందిన ప్రజలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. BJP First List

BJP : 18న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల? 30 నుండి 35 సీట్లు వారికే..!

BJP First List To Be Released

BJP First List : తెలంగాణలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధిష్టానం పలు దశల్లో స్క్రీనింగ్ చేస్తోంది. పార్లమెంటు స్థానాన్ని యూనిట్ గా తీసుకున్న కాషాయ పార్టీ మహిళలకు 2, బీసీలకు 2 స్థానాలు కేటాయించే ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 18న సమావేశం కానున్న బీజేపీ ఎన్నికల కమిటీ తొలి విడత జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు కసరత్తు:
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలై దాదాపు వారం కావొస్తోంది. చాలా రోజుల క్రితమే అధికార బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇటీవలే కాంగ్రెస్ సైతం తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇక, బీజేపీ కూడా ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్టేట్ లెవల్ లో మొదటి జాబితాను ఫైనల్ చేసి జాతీయ నాయకత్వానికి పంపింది రాష్ట్ర పార్టీ. బుధవారం సమావేశం కానున్న బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ
అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

Also Read : BRS ముఖ్యనేతల పోటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్‌, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు

2 మహిళలకు, 2 బీసీలకు :
పార్టీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. లోక్ సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 2 మహిళలకు, 2 బీసీలకు కేటాయించేలా కార్యాచరణ రూపొందించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే చట్టం చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 స్థానాలను మహిళలకు కేటాయించడం ద్వారా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 30 నుండి 35 సీట్లు అతివలకు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బీసీలకు పెద్ద పీట:
మరోవైపు తొలి నుంచి పార్టీలో బీసీలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న బీజేపీ ఆ సామాజికవర్గానికి చెందిన ప్రజలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే డాక్టర్ లక్ష్మణ్ ను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంది. అలాగే బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్న కాషాయ పార్టీ ఒక్కో లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో 2 స్థానాలు బీసీలకు కేటాయించాలని నిర్ణయించుకుంది.

Also Read : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్

ఇదే సమయంలో అభ్యర్థుల బలాబలాలతో పాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుంటున్న అధిష్టానం ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగు పెట్టని కులాల వారికి సైతం టికెట్లు ఇవ్వాలని యోచిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18నే బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.