Purandeshwari : అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ నేత విజయసాయి రెడ్డి : పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ కు మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. టీడీపీకి చెందిన కొంతమంది డిస్టిలరీస్ లను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు అంటూ విమర్శించారు.

Purandeshwari : అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ నేత విజయసాయి రెడ్డి : పురందేశ్వరి

purandeswari

AP BJP President  Purandeshwari : ఆంధ్రప్రదేశ్ కు మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలో పురంధేశ్వరి మాట్లాడుతు..టీడీపీకి చెందిన కొంతమంది డిస్టిలరీస్ లను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు అంటూ విమర్శించారు. దశలవారీగా మద్యం నిషేధం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిన్న చిన్న కిరాణా షాపులు, వీధి బండ్ల వ్యాపారులు కూడా ఆన్ లైన్ నగదు బదిలీలను వినియోగిస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయటంలేదు..? అని ప్రశ్నించారు.

ఈ విషయాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఏపీలో నిధులు దారి మళ్లు తున్నాయని ఆరోపించారు. మద్యం పాలసీకి సంబంధించి ఎటువంటి మార్పులు తీసుకురామని గతంలో చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఆ దిశగా ఏమీ చేయలేదని ఇటువంటి విషయాలపై బీజేపీ ప్రశ్నిస్తే ఎదురు మాటల దాడులు చేయటం తప్ప సమాధానం మండిపడ్డారు.
రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటోంది.. లోకేశ్, పవన్ సీన్లోకి దిగితే ఎలా ఉంటదో ఊహించుకోండి..

మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు బదిలీలవైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది అంటూ పురందేశ్వరి విమర్శించారు. కాగా..ఏపీలో వైసీపీ ప్రభత్వం చేసే అప్పులు భవిష్యత్తులో కూడా తీర్చలేని స్థాయికి చేరుకున్నాయని దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పురందేశ్వరి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.