Sarfaraz Khan : చెప్పేది నీకే.. ముందు నువ్వెళ్లు.. ఆ తరువాత నేనొస్తా.. జైస్వాల్తో సర్ఫరాజ్ ఖాన్ ! ఏంటన్నా ఇదీ!
నాలుగో రోజు భారత ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా సర్ఫరాజ్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Sarfaraz Khan-Yashasvi Jaiswal : టీమ్ఇండియాలో స్థానం కోసం చాన్నాళ్లుగా ఎదురుచూశాడు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. రాజ్కోట్ టెస్టు మ్యాచులో అతడికి అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్తో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
సర్ఫరాజ్ బ్యాటింగ్ పై క్రికెట్ దిగ్గజాలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. అయితే.. అతడు తన బ్యాట్తో మాత్రమే కాదు తన యాటిట్యూడ్తో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కారణంగా రనౌట్ అయినప్పటికీ సర్ఫరాజ్లో ఎలాంటి అసహనం కనిపించలేదు. మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడుతూ జడేజా వల్లే తాను హాఫ్ సెంచరీ చేశానని చెప్పాడు. ఆటలో రనౌట్లు సహజం అని తన హుందాతనాన్ని చాటుకున్నాడు.
IND vs ENG : రాజ్కోట్లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. భార్య రివాబా ఆసక్తికర ట్వీట్
ఇక నాలుగో రోజు భారత ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా సర్ఫరాజ్ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (214 నాటౌట్) ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో భారత స్కోరు 430/4 వద్ద ఉన్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల లక్ష్యాన్ని నిలిచింది.
ఇక ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన సమయంలో జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. మైదానంలోంచి డగౌట్ వెళ్లే సమయంలో కావాలనే సర్ఫరాజ్ ఖాన్ ఆగిపోయాడు. ముందుగా జైస్వాల్ను వెళ్లమని చెప్పాడు. ఇందుకు ఓ కారణం ఉంది. జైస్వాల్ డబుల్ సెంచరీ చేయడంతో అతడికి క్రెడిట్ ఇవ్వాలని భావించి ఇలా చేశాడు. జైస్వాల్ ముందు నడుస్తుంటే ఆ వెనక సర్ఫరాజ్ ఖాన్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సర్ఫరాజ్లోని నిస్వార్థానికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్లు అతడిని కొనియాడుతున్నాడు.
View this post on Instagram