Roja: జనసేనకు దక్కిన సీట్లపై మంత్రి రోజా సెటైర్లు

ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

Roja: జనసేనకు దక్కిన సీట్లపై మంత్రి రోజా సెటైర్లు

Roja

పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అని మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనీసం పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదంటూ ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ-జనసేన జాబితా ప్రకటించినప్పటికీ ఇంకా గందరగోళం నెలకొందని అన్నారు.

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రోజా చెప్పారు. ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు 2014లో అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పారు.

ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రోజా అన్నారు. కమీషన్ల కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని, నోటుకు ఓటు కేసులో రాజధానిని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని అన్నారు. 24 సీట్ల కోసం చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పారు. కాగా, ఇవాళ టీడీపీ-జనసేన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.


Read Also: రేవంత్ చేతకానితనంవల్లే కరెంటు కోతలు.. కానీ చిన్న ఉద్యోగులపై ఫత్వాలు జారీ చేస్తున్నారు: దాసోజు శ్రవణ్